కనిగిరి: పెద గోగులపల్లి లో మిరియం బాబు హత్య కేసులో నిందితుడు రమేష్ రెడ్డి , ఆయన బంధువు రామాంజనేయ రెడ్డి అరెస్ట్:CI వినోద్ కుమార్
చంద్రశేఖరపురం మండలం పెదగోగులపల్లి మాజీ సర్పంచి మరియు వెంకటేశ్వర్లు కుమారుడు మియం బాబు ఈనెల 15న దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ హత్యకు పాల్పడిన ప్రధాన నిందితుడు అదే గ్రామానికి చెందిన చిలంకూరి రమేష్ రెడ్డిని అరెస్టు చేసినట్లు పామూరు సిఐ డీ.వినోద్ కుమార్ మంగళవారం తెలిపారు. అదేవిధంగా హత్య జరిగిన తర్వాత నిందితుడికి ఆశ్రయమిచ్చి, ఆధారాలను చెరిపేసేందుకు ప్రయత్నించిన రమేష్ రెడ్డి బంధువు రామాంజనేయరెడ్డిని కూడా అరెస్టు చేసినట్లు సీఐ తెలిపారు. వీరిని కనిగిరి కోర్టులో హాజరు పరిచినట్లు వెల్లడించారు.