కనిగిరి: పోలీసులు వేధించటం వల్లనే కొండేపి మండలం నర్సాపురానికి చెందిన ప్రసాద్ ఆత్మహత్యాయత్నం:కనిగిరిలో మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్
కనిగిరి లో శుక్రవారం మాజీమంత్రి ఆదిమూలపు సురేష్ మీడియా సమావేశంలో మాట్లాడారు. మర్రిపూడి మండలం నరసాపురం గ్రామానికి చెందిన బోనం ప్రసాద్ ను పోలీసులు వేధించడం వల్లనే పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడని , అతను కనిగిరిలో చికిత్స పొందుతున్నాడన్నారు. ఆరు సంవత్సరాల క్రితం ప్రసాద్ అగ్రవర్ణాల దగ్గర చేసిన అప్పుకు సంబంధించి కేసును పోలీసులు తిరిగి తోడి పోలీస్ స్టేషన్కు పిలిపించి ఆవేదనకు గురి చేసినందు వల్లనే ప్రసాద్ ఆత్మహత్యాయత్నానికి మాజీమంత్రి సురేష్ ఆరోపించారు. రాష్ట్రంలో బడుగు, బలహీన వర్గాలపై దాడులు ఎక్కువయ్యాయని మాజీమంత్రి ఆరోపించారు.