కొండపి: కొండపిలో జరిగిన గణతత్ర దినోత్సవ వేడుకలలో గురుకుల పాఠశాల విద్యార్థిని అభినందించిన ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి స్వామి
ప్రకాశం జిల్లా కొండపి అంబేడ్కర్ బాలికల గురుకుల పాఠశాలలో రిపబ్లిక్ డే వేడుకల్లో ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. పాఠశాలకు ముఖ్య అతిధిగా మంత్రి స్వామి హాజరై విద్యార్థుల ఆటపాటలను వీక్షించారు. అందులో సాంప్రదాయ నృత్యమైన కూచిపూడి నాట్యం చేసిన ఓ విద్యార్థిని నాట్యం చూసి మంత్రి స్వామి మంత్రముగ్ధుడయ్యారు. అనంతరం ఆ విద్యార్థిని దగ్గరకి తీసుకొని ప్రత్యేకంగా అభినందించారు. కళలతోపాటు చదువులో కూడా రాణించాలని చెప్పారు.