కనిగిరి: పట్టణంలో ఈనెల 6న అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి 25వేల మంది జన సమీకరణ: అంబేద్కర్ డెవలప్మెంట్ కమిటీ సభ్యులు
కనిగిరి పట్టణంలోని ఒంగోలు బస్టాండ్ సెంటర్ నందు ఈనెల 6న అంబేద్కర్ కాంస్య విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు అంబేద్కర్ డెవలప్మెంట్ కమిటీ సభ్యులు తెలిపారు. మంగళవారం కనిగిరిలోని అమరావతి గ్రౌండ్ నందు వారు మీడియా సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఆధ్వర్యంలో అంబేద్కర్ కాంస్య విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నామని, కార్యక్రమానికి 25 వేలమంది ప్రజలను సమీకరించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. గినిస్ వరల్డ్ రికార్డులో స్థానం సాధించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని భారీగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.