రాప్తాడు: మహాత్మా గాంధీజీ గ్రామీణ ఉపాధి పథకానికి 90 శాతం నిధులు కేంద్రమే ఇవ్వాలి ఆత్మకూరులో CPI జిల్లా సహాయ కార్యదర్శి మల్లికార్జు
అనంతపురం జిల్లా ఆత్మకూరు మండల కేంద్రంలో శుక్రవారం నాలుగు గంటల సమయంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి మల్లికార్జున మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి మల్లికార్జున సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు రామకృష్ణ మాట్లాడుతూ గ్రామీణ ఉపాధి పథకాన్ని కొనసాగించాలని 90% నిధులు కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలని ఏప్రిల్ 10 11 12 మూడు రోజులు పాటు నిర్వహించే పాదయాత్రలో ఉపాధి హామీ కూలీలు రైతులు సిపిఐ నేత్రంతా పాల్గొని విజయవంతం చేయాలని సిపిఐ మల్లికార్జున, రామకృష్ణ పిలుపునిచ్చారు, ఈ కార్యక్రమంలో రమేష్ పోతులయ్య తదితరులు పాల్గొన్నారు.