రాప్తాడు: జూన్ 1న కలెక్టరేట్ ధర్నా కార్యక్రమంలో పాల్గొనండి ఆత్మకూరులో జిల్లా కౌలు రైతు సంఘం ప్రధాన కార్యదర్శి రామకృష్ణ
అనంతపురం జిల్లా ఆత్మకూరు మండల కేంద్రంలో శనివారం 12 గంటల 45 నిమిషాల సమయంలో జిల్లా కౌలు రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సనప నీలపాల రామకృష్ణ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ జూన్ 1న అనంతపురం కలెక్టరేట్ కౌలు రైతు సంఘం ఆధ్వర్యంలో రైతు సమస్యలపై ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నామని, ఈ ధర్నా కార్యక్రమంలో రైతులంతా పాల్గొని విజయవంతం చేయాలని రైతులకు 90 శాతం సబ్సిడీతో ఖరీఫ్ విత్తనాలు అందించాలని స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం పెట్టుబడి సాయం అందించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామని కౌలు రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రామకృష్ణ పేర్కొన్నారు.