సంతనూతలపాడు: ఉప్పుగుండూరులో వైభవంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి కార్యక్రమం, కలశాలతో ఊరేగింపు నిర్వహించిన మహిళలు
నాగులుప్పలపాడు మండలంలోని ఉప్పుగుండూరులో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి కార్యక్రమాన్ని ఆదివారం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు కలశాలతో గ్రామంలో ఊరేగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక చెరువులోని గంగా జలాలను కలశాలలో నింపుకొని పట్టణంలో ఊరేగింపును చేపట్టారు. కలశాలను అమ్మవారి ఆలయం వరకు తీసుకువచ్చి, అందులోని గంగా జలాలతో అమ్మవారిని అభిషేకించి, పూజలు చేశారు. భక్తులకు ఆశీర్వచనాలను అందజేసిన పండితులు, అమ్మవారి తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు.