సంతనూతలపాడు: చీమకుర్తి పట్టణంలో భారీ చోరీ, 30 సవర్ల బంగారం, 2 కేజీల వెండి, రూ.8 లక్షల నగదు అపహరణ
చీమకుర్తి పట్టణంలో మంగళవారం భారీ చోరీ జరిగింది. పట్టణంలోని అద్దేపల్లి గణేష్ ఇంట్లో గుర్తుతెలియని దుండగులు 30 సవర్ల బంగారం ,రెండు కేజీల వెండి , రూ.8 లక్షల నగదును దోచుకెళ్ళారు .బాధితుల ఫిర్యాదు మేరకు సీఐ ప్రసాద్ ,ఎస్సై సంపత్ పోలీస్ సిబ్బందితో కలిసి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. చోరీ ఘటనపై బాధితుల నుండి వివరాలు సేకరించి ,కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.