సంతనూతలపాడు: చీమకుర్తి పట్టణంలో కొలువైన శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో వైభవంగా హనుమాన్ జయంతి వేడుకలు
చీమకుర్తి పట్టణంలోకి కొలువైన శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో వేద పండితుల ఆధ్వర్యంలో హనుమాన్ జయంతి వేడుకలను వైభవంగా నిర్వహించారు. మంగళవారం తెల్లవారుజాము నుండే భక్తులు శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయానికి తరలివచ్చి, స్వామివారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు, అభిషేకాలను నిర్వహించారు. పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బందులుచకుండా ఆలయ కమిటీ నిర్వాహకులు ప్రత్యేక క్యూ లైన్ లను ఏర్పాటు చేసి స్వామివారి దర్శన భాగ్యాన్ని కల్పించారు. భక్తులకు తీర్థ ప్రసాదాల పంపిణీ తో పాటు అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఆలయ కమిటీ చేపట్టింది.