కనిగిరి: పట్టణంలో లబ్ధిదారులకు రూ.39 లక్షలు విలువ చేసే CMRF చెక్కులను పంపిణీ చేసిన కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహ రెడ్డి
కనిగిరిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు ఒంగోలు పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు, కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి మంగళవారం పంపిణీ చేశారు. నియోజకవర్గంలోని 52 మంది లబ్ధిదారులకు రూ .39 లక్షలు విలువచేసే చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ముఖ్యమంత్రి సహాయనిధి పథకం పేదలకు వరమని, ఆపద సమయంలో కార్పొరేట్ వైద్యశాలలో అప్పుచేసి వైద్యం చేయించుకున్న పేదలను ఆదుకునేందుకు సీఎం చంద్రబాబు ముఖ్యమంత్రి సహాయనిధి పథకం ద్వారా ఆర్థిక సహకారం అందిస్తున్నారన్నారు.