కనిగిరి: పట్టణంలోని దేవాంగ నగర్ లో సిసి రోడ్లను ప్రారంభించిన మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, గొట్టిపాటి రవికుమార్
కనిగిరి పట్టణంలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి బుధవారం పర్యటించారు. ఈ సందర్భంగా పట్టణంలోని అర్బన్ కాలనీలో స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి తో కలిసి రూ.21 లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించిన సిసి రోడ్లను మంత్రులు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తుందని తెలిపారు. కార్యక్రమంలో గిద్దలూరు శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.