కనిగిరి: పొలం తగాదాల కారణంగానే తన కుమారుడి దారుణ హత్య: పెద్ద గోగులపల్లి మాజీ సర్పంచ్ మిరియం వెంకటేశ్వర్లు
చంద్రశేఖరపురం మండలంలోని పెద్దగోగులపల్లి గ్రామ మాజీ సర్పంచ్ మిరియం వెంకటేశ్వర్లు కుమారుడు బాబు శుక్రవారం దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ హత్య ఉదంతంపై మృతుడు బాబు తండ్రి మిరియం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.... పొలం తగాదాల కారణంగానే ఈ హత్య చోటు చేసుకుందన్నారు. తాను పొలం నుండి బైక్ పై వస్తున్న క్రమంలో గ్రామానికి చెందిన రమేష్ కత్తితో తనను దాడి చేయబోయాడని, తన కుమారుడు దాడి నుండి తనను తప్పించే క్రమంలో తన కుమారుడుపై ఈ దాడి జరిగిందన్నారు. ఈ దాడిలో తన కుమారుడిని కోల్పోవడం దురదృష్టకరమన్నారు.