ఉరవకొండ: గ్రామీణ పేదల జీవనాధారంగా నిలిచిన ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసే విధంగా కుట్ర,: సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య
గ్రామీణ పేదల జీవనాధారంగా నిలిచిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని (ఎంఎన్ఆర్ఈజీఎస్) కేంద్ర ప్రభుత్వం దశలవారీగా నిర్వీర్యం చేయడానికి కుట్రపూరిత చర్యలు చేపడుతోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య ఆరోపించారు. అనంతపురం జిల్లా కూడేరు మండలం కమ్మూరు గ్రామంలో శుక్రవారం జరుగుతున్న ఉపాధి హామీ పనులను పరిశీలించిన ఆయన, కూలీలతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి పి. నారాయణస్వామి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బి. కేశవరెడ్డి పాల్గొన్నారు.