సంతనూతలపాడు: చీమకుర్తి మున్సిపల్ కార్యాలయంలో చలివేంద్రాన్ని ప్రారంభించిన మున్సిపల్ కమిషనర్ వై రామకృష్ణయ్య
చీమకుర్తి మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ వై రామకృష్ణయ్య మంగళవారం చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... చీమకుర్తి మున్సిపల్ కార్యాలయానికి వచ్చే ప్రజలకు మరియు పారిశుద్ధ్య కార్మికులకు వేసవిలో దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అదేవిధంగా పారిశుద్ధ్య కార్మికులకు ఓ ఆర్ ఎస్ ప్యాకెట్లను కూడా ప్రతిరోజు పంపిణీ చేసేందుకు నిర్ణయించడం జరిగిందన్నారు. దాతల సహకారంతో చీమకుర్తి మున్సిపాలిటీ వ్యాప్తంగా మరిన్ని చలివేంద్రాలు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు కార్యక్రమంలో మున్సిపల్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.