ప్రకాశం జిల్లా సింగరాయకొండలో ఈనెల 14వ తేదీన నవోదయ పాఠశాలల్లో చదువుతూ అనుమానస్పద మృతి చెందిన విద్యార్థి తౌశిక్ మృతి పై విద్యార్థి తల్లిదండ్రులు అనుమాన వ్యక్తం చేస్తూ అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. ప్రకాశం జిల్లా టిడిపి అధ్యక్షుడు ఉగ్ర నరసింహారెడ్డి బుధవారం విద్యార్థి తల్లిదండ్రులతో ఫోను ద్వారా మాట్లాడి విచారణ జరిపి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే తమ కుమారుడు మృతి చెందినట్లుగా తౌశిక్ తల్లితండ్రులు ఆరోపిస్తున్నారు.