కళ్యాణదుర్గం లో బుధవారం బోర్వెల్ (రిగ్ ఓనర్లు) నిర్వాహకులు నిరవధిక సమ్మె బాట పట్టారు. కళ్యాణదుర్గంలోని మొత్తం 21 బోర్వెల్ లారీలను నిలిపి నిరవధిక సమ్మె చేపట్టారు. ఈ సందర్భంగా రిగ్ ఓనర్ల అసోసియేషన్ నాయకులు మాట్లాడారు. బోర్ వెల్ కు సంబంధించిన సామాగ్రి ధరలు విపరీతంగా పెరిగిపోయాయిన్నారు. సామాగ్రి ధరలను తగ్గించే వరకు ఉద్యమిస్తామన్నారు. మొదట ఐదు రోజులు సమ్మె చేస్తామన్నారు. తర్వాత కూడా సమస్య పరిష్కారం కాకపోతే ఉద్యమ కార్యాచరణను ప్రకటిస్తామన్నారు.