కనిగిరి: పట్టణంలో మౌలిక వసతుల కల్పనకు కృషి: కనిగిరి మున్సిపల్ కమిషనర్ శ్రీధర్
కనిగిరి పట్టణంలోని బాలాజీ నగర్ లో రూ.10 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మిస్తున్న డ్రైనేజీ కాలువల నిర్మాణ పనులను కనిగిరి మున్సిపల్ కమిషనర్ శ్రీధర్ శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా డ్రైనేజీ కాలువల నిర్మాణ పనులను నాణ్యతగా చేపట్టాలని సంబంధిత కాంట్రాక్టర్ ను కమిషనర్ ఆదేశించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి సహకారంతో పట్టణంలో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. అందులో భాగంగా వార్డుల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీ కాలువల నిర్మాణ పనులు చేపట్టామన్నారు. కార్యక్రమంలో పట్టణ టిడిపి అధ్యక్షులు ఫిరోజ్, మైనారిటీ సెల్ నాయకులు జంషీర్ పాల్గొన్నారు.