రాప్తాడు: రాప్తాడు నియోజకవర్గానికి చెందిన 22 మందికి 26 లక్షలు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే పరిటాల సునీత
అనంతపురం జిల్లా కేంద్రంలో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత క్యాంపు కార్యాలయంలో సోమవారం సాయంత్రం నాలుగు గంటల 20 నిమిషాల సమయంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు ఎమ్మెల్యే పరిటాల సునీత పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పరిటాల సునీత మాట్లాడుతూ రాప్తాడు అనంతపురం రూరల్ ఆత్మకూరు మండలాలకు చెందిన 22 మంది కు 26 లక్షల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్బిదారులకు పంపిణీ చేయడం జరిగింది అన్నారు ఎన్టీఆర్ వైద్య సేవలు అందలేని వారికి సీఎం రిలీఫ్ ఫండ్ ఎంతగానో ఉపయోగపడుతుందని భవిష్యత్తులో సీఎం రిలీఫ్ ఫండ్కు దరఖాస్తు చేసుకుంటే తమ వంతు సహకారాన్ని అందజేస్తామని పరిటాల సునీత పేర్కొన్నారు.