సంతనూతలపాడు: చీమకుర్తి మండలం రామతీర్థం లోని పలు మైనింగ్ కంపెనీలలో మైనింగ్ అధికారుల విస్తృత సోదాలు
చీమకుర్తి మండలం రామతీర్థం లోని పలు మైనింగ్ కంపెనీలలో మైనింగ్ అధికారులు మంగళవారం విస్తృత సోదాలను నిర్వహించారు. పలు మైనింగ్ కంపెనీలు నిబంధనలకు విరుద్ధంగా, అక్రమంగా మైనింగ్ కొనసాగిస్తున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో మైనింగ్ అధికారులు ఈ దాడులను నిర్వహిస్తున్నారు. గత రెండు రోజులుగా మైనింగ్ అధికారులు విస్తృతంగా దాడులను నిర్వహిస్తూ ఉండడంతో మైనింగ్ కంపెనీల నిర్వాహకుల్లో ఆందోళన మొదలైంది.