సంతనూతలపాడు: మద్దిపాడు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బాల్యవివాహాలపై బాలికలకు అవగాహన కల్పించిన ఐసిడిఎస్ సిడిపిఓ ఇవాంజలిన్
మద్దిపాడు లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సోమవారం మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బాల్య వివాహాలపై బాలికలకు అవగాహన కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఐసిడిఎస్ సిడిపిఓ ఇవాంజలిన్ మాట్లాడుతూ... బాల్య వివాహాలు చట్ట ప్రకారం నేరమన్నారు. బాల్యవివాహాలు జరిపించిన , ప్రోత్సహించిన జరిమానా మరియు జైలు శిక్ష తప్పవని ఆమె హెచ్చరించారు. గ్రామాల్లో ఎక్కడైనా బాల్యవివాహాలు జరుగుతున్నట్లు బాలికల దృష్టికి వస్తే ఆ సమాచారాన్ని తనకు కానీ , స్థానిక అధికారులకు కానీ తెలియజేయాలని సిడిపిఓ ఇవాంజలిన్ సూచించారు.