కనిగిరి: పామూరు పట్టణంలోని ప్రవేట్ పాఠశాలలో ఉరి వేసుకుని వ్యాపారి ఆత్మహత్య
పామూరు: ఓ ప్రైవేట్ పాఠశాలలో ఉరివేసుకొని వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన పామూరు పట్టణంలో సోమవారం చోటు చేసుకుంది. అందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. పామూరు పట్టణానికి చెందిన ప్రముఖ వ్యాపారి పోకూరి బాల స్థానికంగా ఉండే ఓ ప్రైవేట్ పాఠశాలలో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పాఠశాల సిబ్బంది సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న పామూరు ఎస్సై అనూక్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కనిగిరి ప్రభుత్వ ఏరియా వైద్యశాలకు తరలించారు.