కనిగిరి: హనుమంతునిపాడు కేజీబీవీలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన ఇంటర్ విద్యార్థిని భాగ్యను అభినందించిన మంత్రి నారా లోకేష్
హనుమంతునిపాడు మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో ఇంటర్మీడియట్ లో 1000 మార్కులకు గాను 990 మార్కులు సాధించి కటికల భాగ్య అనే విద్యార్థి స్టేట్ ఫస్ట్ ర్యాంకు సాధించింది. విద్యార్థి భాగ్యను రాజధాని అమరావతిలో జరిగిన ఓ కార్యక్రమంలో మంగళవారం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా భాగ్యకు మంత్రి నారాలోకేష్ లాప్ టాప్ ను బహుకరించారు. పేదరికంలో జీవిస్తూ కూడా కృషి, పట్టుదలతో చదివి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన భాగ్యకు ఆయన అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.