సంతనూతలపాడు: వేసవి సెలవుల్లో పిల్లల పట్ల తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలి: సంతనూతలపాడు ఎస్ఐ అజయ్ బాబు
సంతనూతలపాడు: వేసవి సెలవుల్లో పిల్లల పట్ల తల్లిదండ్రులు తగు జాగ్రత్తలు వహించాలని సంతనూతలపాడు ఎస్ఐ అజయ్ బాబు సూచించారు. సంతనూతలపాడు పోలీస్ స్టేషన్లో బుధవారం ఎస్సై మాట్లాడుతూ.... వేసవి సెలవుల్లో పిల్లలు సరదాగా ఈతకొట్టేందుకు కుంటలు, వాగుల వద్దకు వెళ్లి ప్రమాదాల బారిన పడే అవకాశం ఉందన్నారు. పిల్లలు బయటికి వెళ్లేటప్పుడు వారి పట్ల తల్లిదండ్రులు నిఘా ఉంచాలన్నారు. వేసవిలో గ్రామాల్లో దొంగతనాలు జరిగే అవకాశం ఉందని, గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గ్రామాల్లో సిసి కెమెరాలు ఏర్పాటుకు గ్రామస్తులు చొరవ చూపాలన్నారు.