కొండపి: కొండపి పొగాకు వేలం కేంద్రంలో 833 పొగాకు బేళ్లను కొనుగోలు చేసినట్లు వేలం నిర్వహణ అధికారులు వెల్లడి
ప్రకాశం జిల్లా కొండపి పొగకు వేలం కేంద్రంలో శనివారం రీజనల్ ఇన్ఛార్జి మేనేజర్ సేలం రామారావు సందర్శించారు. ప్రస్తుతం మార్కెట్ పరిస్థితుల్లో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మొత్తం 1168 బేళ్లు అమ్మకానికి తీసుకురాగా 833 బేళ్లు మాత్రం కొనుగోలు చేశారన్నారు. వివిధ కారణాలతో 335 బేళ్లు తిరస్కరించారు. ప్రారంభం నుంచి తిరస్కరణ సంఖ్య అధిక సంఖ్యలో కొనసాగుతూనే ఉందని రైతులు వాపోయారు.