విడపనకల్ గ్రామ సమీపంలో బుధవారం సాయంత్రం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బైకును లారీ ఢీకొనింది. ప్రమాదంలో బైకర్ వెంకటేశులు తీవ్రంగా గాయపడ్డాడు. వేల్పుమడుగు గ్రామానికి చెందిన వెంకటేశులు బైక్లో విడపనకల్లు నుంచి వేల్పు మడుగు కు వెళుతుండగా లారీ ఢీకొనింది. ప్రమాదంలో గాయపడిన వెంకటేశులను 108 అంబులెన్స్ లో ఉరవకొండ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కొరకు అనంతపురం రెఫర్ చేశారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.