రాప్తాడు: కూటమి ప్రభుత్వం రెండేళ్లలో ప్రజలను ఎన్నో వెన్నుపోట్లు పొడిచింది పాపంపేటలో మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి విమర్శలు
అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ లోని పాపం పేటలో శుక్రవారం పదిన్నర గంటల సమయంలో రాప్తాడు మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో వెన్నుపోటుకు రెండేళ్లు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావస్తున్న ప్రజలకు ఇచ్చిన ఏ హామీని నెరవేర్చలేదని ఇచ్చిన హామీని నెరవేర్చాలని ప్రభుత్వానికి నిరసన తెలిపేందుకు వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమాన్ని నిర్వహించి ప్రభుత్వాన్ని ఎండబెట్టడం జరిగిందని ఇప్పటికైనా ఇచ్చిన హామీలను నెరవేర్చాలని మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ప్రశ్నించారు.