సంతనూతలపాడు: పరిసరాల అపరిశుభ్రతతో సీజనల్ వ్యాధులు ప్రభలే అవకాశం: ఎండ్లూరులో సంతనూతలపాడు ఎంపీడీవో సురేష్ బాబు
సంతనూతలపాడు మండలం ఎండ్లూరులో ఎంపీడీవో సురేష్ బాబు మంగళవారం పర్యటించారు. ఈ సందర్భంగా పరిసరాల పరిశుభ్రతపై స్థానిక ప్రజలకు ఎంపీడీవో అవగాహన కల్పించారు. మన ఇళ్ళను ఎంత పరిశుభ్రంగా ఉంచుకుంటామో, పరిసరాలను కూడా అంతే పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. పరిసరాలు అపరిశుభ్రతగా ఉంటే సీజనల్ వ్యాధులు ప్రభలే అవకాశం ఉందని స్థానికులను ఎంపీడీవో హెచ్చరించారు. ఇళ్ల వద్దకు వచ్చే పారిశుద్ధ్య కార్మికులకు తడి చెత్త, పొడి చెత్తను వేరుచేసి అందించాలని సూచించారు.