రాప్తాడు: పేద ప్రజల కోసమే రాప్తాడులో అన్నా క్యాంటీన్ ను ప్రారంభిస్తున్న బహిరంగ సభలో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత
అనంతపురం జిల్లా రాప్తాడు మండల కేంద్రంలో బుధవారం ఒంటి గంట సమయంలో అన్నా క్యాంటీన్ చిల్డ్రన్ పార్క్ ప్రారంభించిన సందర్భంగా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది,ఈ సందర్భంగా ఎమ్మెల్యే పరిటాల సునీత మాట్లాడుతూ రాప్తాడు మండల కేంద్రంలో 61 లక్షల రూపాయలతో ఆరు నెలల లోపల నిర్మాణం చేపట్టి నేడు ప్రారంభించడం జరిగిందని రాప్తాడులో వలస కూలీల కోసం గ్రామీణ ప్రాంతాల్లో పనులకు వెళ్లే ప్రజల కోసం అన్నా క్యాంటీన్ ను తీసుకురావడం జరిగిందని ఐదు రూపాయలకే ఉదయం అల్పాహారం మధ్యాహ్నం భోజనం పేద ప్రజలకు అందుబాటులో ఉంటుందని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత బహిరంగ సభలో పేర్కొన్నారు.