కనిగిరి: పట్టణంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో వైభవంగా స్వామివారి కళ్యాణం, పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు
కనిగిరి పట్టణంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి కళ్యాణ మహోత్సవాన్ని వేద పండితుల ఆధ్వర్యంలో గురువారం అత్యంత వైభవంగా నిర్వహించారు. పట్టణంలోని భక్తులు పెద్ద సంఖ్యలో స్వామివారి కల్యాణానికి తరలివచ్చారు. ఈ సందర్భంగా దంపతుల సామూహిక స్వామివారి కల్యాణోత్సవాలను వేద పండితులు నిర్వహించారు. కళ్యాణం అనంతరం భక్తులకు స్వామివారి తీర్థప్రసాదాలను పండితులు పంపిణీ చేయగా, ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మధ్యాహ్నం భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని చేపట్టారు.