కనిగిరి: జూలై 11న జరిగే జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి: కనిగిరి జూనియర్ సివిల్ జడ్జ్ రూపశ్రీ
కనిగిరి పట్టణంలోని జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టులో జూలై 11న జరిగే జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కనిగిరి జూనియర్ సివిల్ జడ్జ్ రూప శ్రీ కోరారు. కనిగిరిలోని జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం పై పోలీస్ అధికారులతో శనివారం జడ్జి రూప శ్రీ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ...రాజీమార్గమే రాజమార్గం అన్నారు. రాజీమార్గంలో కక్షిదారులు తమ పెండింగ్ కేసులను పరిష్కరించుకునే విధంగా పోలీసులు వారికి అవగాహన కల్పించి జాతీయలో కాదాలత్ కార్యక్రమానికి హాజరయ్యే విధంగా చూడాలని సూచించారు.