కనిగిరి: పామూరులో ఆత్మ బలిదాన్ దివస్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించిన బిజెపి నాయకులు
పామూరు పట్టణంలో భారతీయ జనసంఘ మరియు బిజెపి వ్యవస్థాపకుల్లో ఒకరైన డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ ఆత్మబలిదాన్ దివస్ కార్యక్రమాన్ని మంగళవారం బిజెపి నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బిజెపి జిల్లా నాయకులు కొండిశెట్టి వెంకటరమణయ్య ఆధ్వర్యంలో శ్యామ ప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. నమ్మిన సిద్ధాంతం కోసం పోరాడిన నాయకుడు శ్యామ ప్రసాద్ ముఖర్జీ అని కొనియాడారు. కాశ్మీర్ కోసం, దేశం కోసం ఆయన బలిదానం చేశారని, ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని వెంకట రమణయ్య పిలుపునిచ్చారు.