కనిగిరి: జమ్మలమడకలో పోషణ పక్వాడ పక్షోత్సవాల సందర్భంగా బాలింతలు, గర్భవతులు, చిన్నారులకు అవగాహన కార్యక్రమం
కనిగిరి మండలం జమ్మలమడకలోని అంగన్వాడీ కేంద్రంలో పోషణ పక్వాడ 8వ పక్షోత్సవాల సందర్భంగా బాలింతలు, గర్భవతులు, చిన్నారులకు అవగాహన కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐసిడిఎస్ సూపర్వైజర్ ఏవీఎస్ పార్వతి మాట్లాడుతూ.... శిశువు గర్భంలో ఉన్నప్పుడు నుండి మూడు సంవత్సరాల వరకు మెదడు ఎదుగుదల 85% ఉంటుందన్నారు. ఆ సమయంలో సరైన పోషకాహారం పిల్లలకు అందించవలసిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందన్నారు. మెదడులో ఎదుగుదల లేకపోతే పిల్లల్లో జ్ఞాపకశక్తి తగ్గిపోవడంతో పాటు ప్రారంభ ఎదుగుదలను అది అడ్డుకుంటుందన్నారు.