కనిగిరి: పట్టణంలోని మంచినీటి దొరువును అభివృద్ధి చేసేందుకు చర్యలు: కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి
కనిగిరి పట్టణంలో జల ధార-జల హారతి కార్యక్రమంలో శనివారం ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పట్టణంలోని చారిత్రక మంచినీటి దొరువు లో మున్సిపల్ సిబ్బందితో వ్యర్ధాలను తొలగించారు. అనంతరం దొరువులో కలుషితమైన నీటిని మోటార్ల ద్వారా బయటికి పంపారు. దరువులో పూడికతీత పనులు చేపట్టి అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. అదేవిధంగా దొరువు చుట్టూ వాకింగ్ ట్రాక్ ను ఏర్పాటు చేయదలచినట్లు ఎమ్మెల్యే తెలిపారు.