కొండపి: పొగాకు రైతుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటాం: పేర్నమిట్టలో మంత్రి స్వామి
సంతనూతలపాడు మండలం పేర్నమిట్ట పొగాకు బోర్డులోని వేలం ప్రక్రియను మంగళవారం రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి, కొండేపి ఎమ్మెల్యే బాల వీరాంజనేయ స్వామి పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులు, పొగాకు రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. పొగాకు పంటకు గిట్టుబాటు ధర కల్పించే విధంగా తగు చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే పొగాకు రైతుల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఎమ్మెల్యే బి. ఎన్ విజయ్ కుమార్ పాల్గొన్నారు.