రాయదుర్గం: నియోజకవర్గంలో 85 శాతం SIR ఓటరు మ్యాపింగ్ పూర్తి : ఈఆర్ఓ రవిశంకర్ రెడ్డి
రాయదుర్గం నియోజకవర్గంలో SIR ఓటర్ మ్యాపింగ్ 85% పూర్తయిందని ఈఆర్ఓ రవిశంకర్ రెడ్డి తెలిపారు. సోమవారం తహసీల్దార్ కార్యాలయంలో అన్ని పార్టీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. బీఎల్ఓల ద్వారా 80% ఓటర్లకు రీ-ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ చేసినట్లు వెల్లడించారు. మిగిలిన వారికి ఫారాలు అందించేందుకు పార్టీలు సహకరించాలని కోరారు. ఓటర్ జాబితా సవరణలో సమస్యలుంటే తెలియజేయాలన్నారు. సమావేశంలో తహసీల్దార్ సూర్యప్రతాప్, కమిషనర్ దివాకర్ రెడ్డి, డిప్యూటీ తహసీల్దార్ సుజాత పాల్గొన్నారు.