సంతనూతలపాడు: మద్దిపాడు మండలం బసవన్నపాలెంలో ఇద్దరు వ్యక్తుల మధ్య ఘర్షణ, ఒకరికి కత్తిపోట్లు , వైద్యశాలకు తరలింపు
మద్దిపాడు మండలం బసవన్నపాలెంలో మంగళవారం క్రికెట్ మ్యాచ్ జరుగుతున్న సందర్భంగా నందిపాడు అరుంధతి నగర్ కు చెందిన సురేష్ అతని స్నేహితుడు నవీన్ మధ్య స్వల్ప వివాదం చోటుచేసుకుంది. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య మాట మాట పెరగడంతో నవీన్ కత్తితో సురేష్ ను పొట్టపై బలంగా పొడిచాడు. దీంతో సురేష్ కు తీవ్ర రక్తస్రావం కావడంతో అతనిని వెంటనే ఒంగోలులోని కిమ్స్ వైద్యశాలకు తరలించారు. సమాచారం తెలుసుకున్న మద్దిపాడు ఎస్సై వెంకట సూర్య ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.