కనిగిరి: పట్టణంలో ప్రభుత్వ వైద్యశాల అభివృద్ధి కమిటీ సమావేశంలో పాల్గొన్న కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి
కనిగిరి పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాల అభివృద్ధి కమిటీ సమావేశంలో ఒంగోలు పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు మరియు కనిగిరి శాసనసభ్యులు డాక్టర్ ముక్కు ఉగ్ర నర్సింహారెడ్డి మంగళవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైద్యులు, సిబ్బందితో ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి సమావేశమయ్యారు. ప్రభుత్వ వైద్యశాలకు వచ్చే రోగుల పట్ల ప్రేమపూర్వకంగా మెలగాలని సూచించారు. పేదలకు మెరుగైన వైద్య సేవలను అందించేందుకు, వైద్యులు సిబ్బంది కృషి చేయాలని ఆదేశించారు. ఆసుపత్రిలో ఇంకా ఏమైనా మౌలిక వసతులు అవసరం అయితే తెలపాలని వైద్యులకు ఎమ్మెల్యే సూచించారు.