సంతనూతలపాడు: నాగులుప్పలపాడు మండలం అమ్మనబ్రోలు రైల్వే గేటు ఈనెల 8 నుండి మూసివేస్తున్నట్లు ప్రకటించిన రైల్వే శాఖ అధికారులు
నాగుల పులపాడు మండలం అమ్మనబ్రోలు లో ఉన్న రైల్వే గేటును ఈనెల 8వ తేదీ నుండి మూసివేస్తున్నట్లు రైల్వే శాఖ అధికారులు ఆదివారం తెలిపారు. రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణం కారణంగా రైల్వే గేటును మూసివేస్తున్నట్లు తెలిపారు. అందువల్ల ఈనెల 8వ తేదీ నుండి ఉన్నతాధికారులు ఆదేశాలు వచ్చేవరకు రైల్వే గేటును మూసి వేస్తున్నామన్నారు. వాహనదారులు మరియు ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా రాకపోకలను కొనసాగించాలని అధికారులు సూచించారు.