రాప్తాడు: ఆత్మకూరు మండల కేంద్రంలో మహానాడు కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నేతలతో కలిసి పాల్గొన్న రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత
అనంతపురం జిల్లా ఆత్మకూరు మండల కేంద్రంలో బుధవారం 11 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు నిర్వహించిన మహానాడు కార్యక్రమంలో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత ముఖ్యఅతిథిగా హాజరై మహానాడు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పరిటాల సునీత మాట్లాడుతూ నందమూరి తారక రామారావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని స్థాపించి 9 నెలల్లోనే అధికారంలోకి తీసుకువచ్చి అనేకమంది బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం ఇచ్చిన గొప్ప వ్యక్తిని అటువంటి పార్టీలో మనమందరం ఉండడం ఆనందంగా ఉందని మహానాడులో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత పిలుపునిచ్చారు.