కొండపి: కొండపి జనసేన ఇన్చార్జిగా అవకాశం ఇవ్వాలని దరఖాస్తు చేసుకున్న మనోజ్ కుమార్, కొండపిలో జనసేన సమావేశం
ప్రకాశం జిల్లా కొండపి నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ పదవికి కనపర్తి మనోజ్ కుమార్ దరఖాస్తు చేసుకున్నారు. మంగళవారం కొండపిలో వెంకట రోశయ్య అధ్యక్షతన జనసేన సమాచార సేకరణ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా 2014 నుంచి పార్టీ కోసం శ్రమిస్తూ, పొన్నలూరు మండల అధ్యక్షుడిగా, నియోజకవర్గ (POC)గా పనిచేస్తున్న మనోజ్ కుమార్ ఈ పదవికి దరఖాస్తు సమర్పించారు. కూటమి విజయానికి కృషి చేసిన తనకు ఈసారి ఇన్ఛార్జ్ బాధ్యతలు ఇవ్వాలన్నారు.