యర్రగొండపాలెం: దోర్నాల శ్రీశైలం రహదారిలో చిరుత పులి సంచారం ఆ దృశ్యాలను తమ సెల్ ఫోన్ లో చిత్రీకరించిన భక్తులు
మార్కాపురం జిల్లా దోర్నాల శ్రీశైలం రహదారిలోని శిఖరం సమీపంలో చిరుత పులి సంచారం కలకలం రేపింది కారులో ప్రయాణిస్తున్న యాత్రికులకు రోడ్డు పక్కన డివైడర్ పై కూర్చుని చిరుత కనిపించగా ఆ దృశ్యాలను తమ సెల్ ఫోన్ లో చిత్రీకరించారు. ఇటీవలే సాక్షి గణపతి వద్ద ఎలుగుబంటి సంచారం కూడా కనిపించింది. ఎండ తీవ్రత నేపథ్యంలో నీటి కోసం బయటకు వస్తున్నాయని యాత్రికులు అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ అధికారులు సూచించారు.