రాయదుర్గం: ఎమ్మెల్యే వద్ద సమస్యలు ఏకరువుపెట్టిన హనుమాపురం తాజా మాజీ సర్పంచ్ జయరాం చౌదరి
*ఎన్ హనుమాపురం సమస్యలపై ఎమ్మెల్యేకు వినతి* కణేకల్లు మండలంలోని ఎన్ హనుమాపురం గ్రామ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలంటూ తాజా మాజీ సర్పంచ్, టీడీపీ సీనియర్ నేత జయరాం చౌదరి స్థానిక ఎమ్మెల్యేను కోరారు. శుక్రవారం కణేకల్లులో రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు నిర్వహించిన ప్రజా దర్బార్లో ఆయన పాల్గొని వినతిపత్రాలు అందజేస్తూ సమస్యలపై ఏకరువుపెట్టారు. గ్రామంలో తాగునీటి ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మించాలని, స్మశాన వాటిక ఏర్పాటు, అంగన్వాడీ భవనాల నిర్మాణం వంటి సమస్యలు ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. వాటికి తక్షణ పరిష్కారం చూపాలని ఎమ్మెల్యేను విజ్ఞప్తి చేశారు.