రాయదుర్గం: పట్టణంలోని దశభుజమహాగణపతి ఆలయంలో జిఎస్టి స్టేట్ ట్యాక్స్ జాయింట్ కమీషనర్ హేమ ప్రత్యేక పూజలు
రాయదుర్గంలో ప్రసిద్ధి చెందిన దశభుజ మహాగణపతి ఆలయాన్ని జిఎస్టి స్టేట్ ట్యాక్స్ జాయింట్ కమీషనర్ హేమ సందర్శించారు. ఆదివారం ఆమె ఆలయానికి చేరుకోగా గార్మెంట్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు టంకశాల హనుమంతు, సెక్రటరీ బీసా శ్రీనివాసులు, డీలక్స్ రాజు, ఆల్ మర్చెంట్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు చెన్నవీర, కార్యదర్శి బిహెచ్ ఇస్మాయిల్, ఆర్గనైజింగ్ సెక్రటరీ పొరాళ్ల ధనార్దూన, క్లాత్ మర్కంట్ అసోసియేషన్ అధ్యక్షులు జగదీష్, కిరాణా మర్చెంట్స్ అసోసియేషన్ కార్యదర్శి కేడిమి నాగరాజు తదితరులు సస్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో ఆమె ప్రత్యేక పూజలు జరిపించారు.