మార్కాపురం: హిందూ ధార్మిక పరిరక్షణ ట్రస్ట్ జిల్లా కోఆర్డినేటర్ గా గోపాలుని హరిహరరావు నియామకం
హిందూ ధార్మిక కార్యక్రమాలు నిర్వహించుటకు, ప్రచారం చేయుటకు మార్కాపురం జిల్లా కోఆర్డినేటర్ గా గోపాలుని హరిహరరావును నియమించారు. ఆయన గత 30 సంవత్సరాల నుండి హిందూ ధార్మిక కార్యక్రమాలు, సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. శిరిడి సాయిబాబా మందిరం దత్త మందిరం చంద్రమౌళీశ్వర ఆలయం నిర్మాణంలో ప్రముఖ పాత్ర పోషించారు. ఈ సందర్భంగా చైర్మన్ దాసరి శ్రీనివాసులకు హరిహరరావు కృతజ్ఞతలు తెలిపారు.