రాయదుర్గం: ఆర్. కొత్తపల్లిలో వ్యక్తి ఆత్మహత్య
గుమ్మగట్ట మండలం, ఆర్. కొత్తపల్లి గ్రామంలో మహంతేష్ అనే వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామస్తుల సమాచారం మేరకు మహంతేష్కు కర్ణాటక రాష్ట్రం కొండ్లపల్లి గ్రామానికి చెందిన రాధమ్మతో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారం రోజుల క్రితం భార్య ఇంటి నుంచి వెళ్లిపోయి తిరిగి రాలేదు. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఇదే విషయంలో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లు వారు తెలిపారు. సమాచారం అందుకున్న గుమ్మగట్ట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.