గిద్దలూరు: కొమరోలు మండలంలో ఈనెల 25వ తేదీ విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని ఏఈ శ్రీనివాసులు వెల్లడి
మార్కాపురం జిల్లా కొమరోలు మండలంలో ఈనెల 25వ తేదీ గురువారం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని బుధవారం ఏఈ శ్రీనివాసులు ఓ ప్రకటనలో తెలిపారు. మరమ్మత్తుల కారణంగా సర్వేరెడ్డిపల్లి, పురుషోత్తమునిపల్లి, కే బొంతపల్లి, తాతిరెడ్డిపల్లి గ్రామాలలో ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు వ్యవసాయ గృహ సంబంధిత విద్యుత్ సరఫరా నిలిచిపోతుందని ఈ విషయాన్ని స్థానిక ప్రజలు గమనించి అధికారులకు సహకరించాలని శ్రీనివాసులు విజ్ఞప్తి చేశారు.