రాయదుర్గం: మాదకద్రవ్యాల వినియోగాన్ని పూర్తిగా నిర్మూలించడానికి ప్రతీఒక్కరూ కృషి చేయాలంటూ KTS కళాశాలలో అవగాహన సదస్సు
అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక, అక్రమ రవాణా నిరోధక దినోత్సవాన్ని పురస్కరించుకుని రాయదుర్గం KTS ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో NSS విభాగం ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో బుధవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఇన్చార్జి ప్రిన్సిపాల్ లక్ష్మీనారాయణ, ఎక్సైజ్ అధికారులు మాట్లాడుతూ, సమాజం నుంచి మాదకద్రవ్యాల వినియోగాన్ని పూర్తిగా నిర్మూలించడానికి ప్రతీఒక్కరూ కృషి చేయాలని కోరారు. కొంతమంది యువత మత్తు పదార్థాలకు బానిసై శారీరకంగా, మానసికంగా కుంగిపోతున్నారని వివరించారు. దీనివల్ల కుటుంబం, దేశం బలహీనపడతాయని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థులంతా జాగృతంగా ఉండి మాదకద్రవ్యాల వ్యతిరేక రాయబారులుగా మారాలన్నారు.