రాయదుర్గం: గొడిశలపల్లి లో ప్రతిపాదిత వాకింగ్ పార్కు స్థలాన్ని పరిశీలించిన ఉన్నత స్థాయి అధికారులు
డి.హీరేహాళ్ మండలం గోడిసలపల్లి చెరువు సమీపంలో ప్రతిపాదిత వాకింగ్ పార్కు స్థలాన్ని అధికారులు పరిశీలించారు. CQCO గోపీచంద్, DWMA PD సలీం బాషా, మార్కెట్ యార్డ్ చైర్మన్ హనుమంతరెడ్డి, MPDO దాసనాయక్ లు బుధవారం స్థలాన్ని సందర్శించారు. పార్కు నిర్మాణానికి అనువైన ప్రాంతం, వసతులు, ప్రజలకు కలిగే ప్రయోజనాలపై చర్చించారు. గ్రామస్థులకు ఆరోగ్యకర వాతావరణంలో నడక, వ్యాయామం కల్పించేందుకు పార్కు దోహదపడుతుందని అభిప్రాయపడ్డారు. తదుపరి చర్యలు వేగవంతం చేస్తామని అధికారులు తెలిపారు.