దర్శి: దివంగత రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన దర్శి ఎమ్మెల్యే శివ ప్రసాద్ రెడ్డి
ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలో వైసీపీ జిల్లా అధ్యక్షుడు మరియు స్థానిక ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో దివంగత రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ వైయస్సార్ ఆపర భగీరథుడని కొనియాడారు. పేదలకు ఎన్నో పథకాలు అమలు చేశారని గుర్తు చేశారు. కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ తదితరులు పాల్గొన్నారు.