ఉరవకొండ: ఉరవకొండలో అన్నా క్యాంటీన్ నూతన భవనాన్ని ప్రారంభించిన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్
ఉరవకొండ లోని ఆర్ అండ్ బీ బంగ్లా సమీపంలో నూతన అన్నా క్యాంటీన్ భవనాన్ని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ఆయా శాఖల అధికారులు, టీడీపీ నాయకులతో కలిసి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన అందరితో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రంలో పేదలందరీ ఆకలి తీరుస్తున్నారన్నారు. కేవలం ఐదు రూపాయలకే భోజనం, అల్పాహారం పెడుతున్నారన్నారు. ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.